వ్యక్తిగత వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్..... లాడ్జీలో ప్రియురాలిపై అత్యాచారం

     Written by : smtv Desk | Tue, Feb 12, 2019, 06:43 PM

వ్యక్తిగత వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్.....  లాడ్జీలో ప్రియురాలిపై అత్యాచారం

ముంబై, ఫిబ్రవరి 12: ప్రియురాలిని రెండు రోజుల పాటు లాడ్జీలో బంధించి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తనకు దూరంగా ఉంటుందన్న సాకుతో ఆ యువకుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇవాళ ఉదయం లాడ్జీ నుండి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అఘాయిత్యం గురించి బయటపడింది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర పోల్ఘార్ జిల్లాలో బోయిసర్‌ పట్టణానికి చెందిన ఫైజల్ షఫీ( 23) అనే యువకుడు ఓ యువతి(21) కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఫైజల్ ప్రవర్తన నచ్చక సదరు యువతి గత రెండేళ్లుగా అతడికి దూరంగా ఉంటూ వస్తుంది. దీంతో ఆమెపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్న ఫైజల్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఓ పన్నాగం పన్నాడు.

కాగా సదరు యువతికి తెలియకుండా రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా తనతో శారీరక సంబంధం కొనసాగించకుంటే ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేస్తానని యువతిని భయపెట్టి ఈ నెల 10 వ తేదీన పట్టణంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు.

లాడ్జీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అందులో యువతిని బంధించాడు. ఇలా 2 రోజుల పాటు ఆమెను గధిలోని నిర్భందించి పలుమార్లు దారుణంగా అత్యాచారం చేశాడు. ఇవాళ ఉదయం ఈ లాడ్జీ నుండి తప్పించుకున్న యువతి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు వివరించింది.

బాధిత యువతి నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందుతుడు షపీని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుండి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.





Untitled Document
Advertisements