న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రముఖ దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడన్నా విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు రాజీవ్ సక్సేనా అప్రూవర్గా మారనున్నట్లు సమాచారం. ఇందు కొరకు ఈడీ, సక్సేనా తరుపు న్యాయవాదులు ఓ అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు. సక్సేనా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ను కోర్ట్ విచారించింది. తరువాత సక్సేనా అప్రూవర్గా మారే విషయమై ఇరువర్గాలు ఉమ్మడి పిటిషన్ దాఖలు చేస్తాయన్నాయి.
సక్సేనా తరపు న్యాయవాది గీతా లూథ్రా స్పందిస్తూ, ఈడీ అధికారుల ఎదుట సక్సేనా అన్ని విదాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. సక్సేనాకు గుండె సంబంధిత వ్యాధి ఉందనీ, 4 స్టెంట్లు వేశారని తెలిపారు. అలాగే, సక్సేనాకు లుకేమియా మొదటి దశలో ఉందని పేర్కొన్నారు. భారత్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో అగస్టా హెలికాపర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. అయితే, ఈ విషయం పట్ల భారీగా ముడుపులు అందినట్టు కథనాలు రావడంతో కేంద్రం ఒప్పందాన్ని రాద్దుచేసుకుంది. సక్సేనా బెయిల్ పిటిషన్ను గురువారం విచారిస్తామని ఢిల్లీలోని ఓ కోర్ట్ తెలిపింది.