న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) అధ్యక్షుడిగా నీరజ్ కుందన్ను రాహుల్ గాంధీ నియమించారు. కొద్ది రోజుల క్రితం వరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఫిరోజ్ ఖాన్ బాధ్యలు నిర్వహించగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్లో వైదొలిగారు. గతంలో నీరజ్ కుందన్ ఎన్ఎస్యూఐ జమ్మూ కశ్మీర్ చీఫ్గా పనిచేశారు. కాగా రెండేళ్ల క్రితం కుందన్ ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎలాంటి రాజకీయ వారసత్వంలేని కుందన్ విద్యార్థి కార్యకర్తగా రాజకీయజీవితం ప్రారంభించారు.