ఎన్నికలకు ముందే కిసాన్ సమ్మాన్ నిది!

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 08:33 AM

ఎన్నికలకు ముందే కిసాన్ సమ్మాన్ నిది!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తమ పనులను చకచక నిర్వహిస్తుంది. ఈమధ్యనే బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిది పథకం కింద రూ.6000 ఇవనున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని సార్వత్రిక ఎన్నికల ముందే రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇప్పుడు అర్హులైన రైతుల ఖాతాల్లో రెండు విడతల రూ.4 వేలను జమ చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతగా మార్చిలోపు రూ.2 వేలు, మిగతా రూ.2 వేలను ఎన్నికల ముందు జమ చేసేందుకు సిద్దమయ్యారు అధికారులు. మిగతా రూ.2 వేలు ఎన్నికల తర్వాత జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం ద్వార దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.





Untitled Document
Advertisements