'పేట' కాంబో మళ్ళీ తెరపైకి...

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 09:40 AM

'పేట' కాంబో మళ్ళీ తెరపైకి...

హైదరాబాద్, ఫిబ్రవరి 14: 20 సంవత్సరాల క్రితం త్రిష, సిమ్రాన్ 'జోడీ' సినిమాలో కలిసి తెరపై కనిపించారు. ఆ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించగా త్రిష ఆమె స్నేహితురాలి పాత్రలో కనిపించింది. అయితే తర్వాత సిమ్రాన్ తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది. కానీ త్రిష టాప్ కథానాయికగా మారిపోయింది. చాల కాలం తర్వాత సిమ్రాన్ మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెట్టింది. మళ్ళీ వీరిద్దరూ 20 సంవత్సరాల తర్వాత రజినీకాంత్ 'పెట్ట' సినిమాలో కలిసి నటించారు.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం పై వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇన్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ వార్తలు నిజమేనని స్పష్టం చేసింది. సుమంత్ రాధాకృష్ణ‌న్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేయాలనే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.





Untitled Document
Advertisements