బాలీవుడ్ భామ సంచలన నిర్ణయం

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 01:11 PM

బాలీవుడ్ భామ సంచలన నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఝాన్సీ లక్ష్మి భాయి బయోపిక్ గా తెరకెక్కిన 'మణికర్ణిక' విజయంతో కంగన రనౌత్ మంచి హుషారుగా ఉంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో సగభాగానికి దర్శకత్వం వహించగా మిగతా భాగానికి కంగనా స్వయంగా దర్శకత్వ భాధ్యతలు స్వీకరించి ఈ సినిమాను పూర్తి చేసింది. ఈ విషయంలో కంగనా, క్రిష్ ల మద్య కోల్డ్ వార్ జరిగింది. అయితే ఇప్పుడు కంగనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆమె తన బయోపిక్ నే తెరకెక్కించబోతున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఆ చిత్రానికి స్వయంగా తానే దర్శకత్వం వహించనుందని తెలిపింది.

'బాహుబలి', 'మణికర్ణిక' చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ బయోపిక్ కు కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 'మణికర్ణిక'కు పని చేసిన టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు కూడా పని చేయనున్నారు. ఈ చిత్రంలో ఆమె జీవితంలో జరిగిన అనేక ఘటనలను చుపించానున్నారని చిత్ర బృందం తెలిపారు.





Untitled Document
Advertisements