న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి అనంతరం తిరిగి జట్టులోకి చేరనున్నారు. త్వరలో జరగున్న వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పలువురు కోహ్లీ, బుమ్రాకు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్లో నాలుగు, ఐదు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్కు విశ్రాంతి నిచ్చింది. విశ్రాంతి అనంతరం ఈ నెల 24 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఓపెనర్, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ దృష్ట్యా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.