జవాన్లపై ఉగ్రవాదుల దాడి : అమరవీరులకు సంతాపం తెలిపిన ప్రియాంక గాంధీ

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 09:27 PM

జవాన్లపై ఉగ్రవాదుల దాడి : అమరవీరులకు సంతాపం తెలిపిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జవాన్ల పై జరుగిన ఉగ్రవాదుల దాడిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి స్పందించారు. అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల‌కు సంతాపం ప్రకటించి అమర వీరులకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా నిరోధించడానికి సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సాయంత్రం ప్రియాంక లక్నోలో ఏర్పాటు చేసిన తన ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో బీజేపీ నేతలు అవతార్ సింగ్ భడానా, రామ్ లాల్ రాహీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాల్సి ఉంది.





Untitled Document
Advertisements