డెహ్రాడూన్, ఫిబ్రవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని ఉద్దమ్సింగ్నగర్ జిల్లాలో ఒక ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో నాలుగు గంటలకుపైగా డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్లో విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
నిన్న ఉదయం 7 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని తెల్లవారుజామునే అక్కడ వర్షం పడడంతో ఇంచుమించు నాలుగు గంటలకుపైగా అక్కడే నిరీక్షించారు. రుద్రాపూర్ బయల్దేరాలని అనుకున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా వెళ్ళడం అసాధ్యపడంతో ఫోన్లోనే ర్యాలీనుద్దేశించి మోదీ ప్రసంగించారు. రుద్రాపూర్ రాలేకపోయినందుకు చింతిస్తున్నానంటూ క్షమాపణ కోరారు. ర్యాలీలో పాల్గొనడంతోపాటు, రాష్ట్ర సమీకృత సహకార అభివృద్ధి సంస్థను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది.