అతిలోక సుందరి సినీ నటి శ్రీదేవి ప్రధమ వర్ధంతి

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 10:59 AM

అతిలోక సుందరి సినీ నటి శ్రీదేవి ప్రధమ వర్ధంతి

చెన్నై, ఫిబ్రవరి 15: తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన అందాల నటి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఆమె మరణించి అప్పుడే ఏడాది గడిచిపోయింది. గతేడాది ఫిబ్రవరి 24న మరణించిన ఆమెకు గురువారం ఆమె కుటుంబ సభ్యులు తొలి వ‌ర్ధంతిని చెన్నైలో జ‌రిపారు. శ్రీదేవికి చెన్నై పై ఉన్న అభిమానం కారణంగా ఆమె వర్ధంతిని చెన్నైలోని ఆమె నివాసంలో జరిపారు.

ఈ కార్యక్రమానికి శ్రీదేవి కుటుంబ సభ్యులు బోణీ కపూర్, జాన్వి కపూర్, ఖుషి కపూర్, అనిల్ కపూర్ హాజరయ్యారు. వారితో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా శ్రీదేవి ప్రధమ వర్ధంతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుబ్బిరామి రెడ్డి, తమిల్ హీరో అజిత్ ఆయ‌న భార్య శాలిని కూడా వ‌చ్చారు.

శ్రీదేవి మరణించిన రోజు ఫిబ్ర‌వ‌రి 24న చెన్నైలోని ఆమె సొంత ఇంట్లోనే పెద్ద కార్య‌క్ర‌మం చేయాలనీ ఆమె భర్త బోణీ కపూర్, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. దానికి సంభందించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.





Untitled Document
Advertisements