అమరావతి, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు చేసారు. శుక్రవారం ఉదయం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రదాని మోదీ, కేసీఆర్ ను కాదనలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని అన్నారు.
ఈ ఇద్దరిలో ఎవరిని కాదన్నా జగన్ జైలుకు వెళ్ళవలసిందే అని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ అభివృద్ధిని ఆడ్డుకోవడమే జగన్, కేసిఆర్, మోదీల లక్ష్యమని ఆయన అన్నారు. వీరి కుట్రను తిప్పికొట్టాలని ప్రజా శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ కంటే ముందుగా అమరావతి అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదన్న భయం వారిలో కలిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను కేంద్రంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తనకు ప్రజల సహకారం కావాలని చంద్రబాబు కోరారు.