న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కబుర్లు చెప్పడం ఆపి, పాకిస్థాన్ తో యుద్ధం చేసేందుకు కదలాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం ఆవేదన వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ఇక మాటలల్లేవాని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని అన్నారు.
వేర్పాటు వాదులను ఉపేక్షిస్తుంటే ఇలాంటి ఘటనలే జరుగుతుంటాయని హెచ్చరించిన గంభీర్, పాక్ తో యుద్ధం చెయ్యాల్సిందేనని అభిప్రాయపడ్డారు. "ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా, యుద్ధ మైదానంలో ఉండాలి" అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా ఆయనకు మద్దతు పలుకుతూ, యుద్ధానికి దిగాల్సిందేనని పలువురు స్పందిస్తున్నారు.