ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తు కనుక్కున్న వారికి కేఏ పాల్ ను కలిసే అవకాశం

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 02:02 PM

ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తు కనుక్కున్న వారికి  కేఏ పాల్ ను కలిసే అవకాశం

విజయవాడ, ఫిబ్రవరి 15: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి రాజకీయ వాతావరణాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కొత్తగా ఏర్పడిన జనసేన ఇలా ముక్కోణపు పోరు బలంగా నడుస్తున్న తరుణంలో తానే కాబోయే ముఖ్యమంత్రి అంటూ తెరపైకి వచ్చాడు ప్రజాశాంతి వ్యవస్థాపకుడు క్రైస్తవ మత ప్రచార కర్త డాక్టర్ కేఏ పాల్.

తాజాగా కేఏ పాల్ తమ పార్టీ గుర్తును ప్రకటిస్తానంటూ ప్రెస్ మీట్ కు పిలుపునిచ్చారు, ఇటీవల ఎన్నికల కమీషన్ తమ పార్టీకి గుర్తు ప్రకటించిందని, గుర్తు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. ఈ క్రమంలో ప్రెస్ మీట్ కు పిలుపునిస్తూ ట్వీట్ చేసిన కేఏ పాల్ ప్రధాన పార్టీలకు సంబందించిన గుర్తులపై సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు.

పగిలిపోయే గ్లాస్ కాదు, ఆగిపోయే ఫ్యాన్ కాదు , తుప్పు పెట్టె సైకిల్ కాదు అంటూ కామెంట్ చేసారు. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తు ఏంటో కనుక్కున్న వారికి పాల్ ను కలిసే అవకాశం అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

హేలీకాఫ్టర్, ఏరోప్లేన్, కన్ను ఈ మూడిట్లో ఒక గుర్తును ఎన్నికల సంఘం తమ పార్టీకి ఆమోదించిందని తెలిపారు శుక్రవారం సాయంత్రం తమ పార్టీ గుర్తు ప్రెస్ మీట్ లో ప్రకటిస్తానని, మీడియా సమావేశానికి సీనియర్ జర్నలిస్టులు, బ్యురో చీఫ్ లు మాత్రమే రావాలని కండిషన్ పెట్టారు పాల్.





Untitled Document
Advertisements