ఎయిర్ టెల్ వినియోగదారులకు శుభవార్త...!

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 08:05 PM

ఎయిర్ టెల్ వినియోగదారులకు శుభవార్త...!

ఫిబ్రవరి 15: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్ టెల్ తన ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం రూ.1699 రీఛార్జి ప్లాన్ ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 1 జీబీ డేటా లభించే ఈ ఆఫర్లో భాగంగా కస్టమర్లు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

అలాగే, దీనిలో రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పంపుకునే వీలుంది. కాగా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ నెట్ వర్క్ సంస్థలు ఇప్పటికే సంవత్సరం వ్యాలిడిటీ గల ప్లాన్లని అందిస్తున్నాయి.





Untitled Document
Advertisements