హైదరాబాద్, ఫిబ్రవరి 15: 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా డిజాస్టర్ తో మరో భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ బృందం. ఈ నెల 22 న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా నుండి ఓ ట్రైలర్ ను రేపు విడుదల చేయడానికి సిద్దమయ్యారు.
మొదట మహానాయకుడు కథానాయకుడు ట్రైలర్ ఒకటే అని చెప్పిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో ట్రైలర్ ను కట్ చేసింది. సెకండ్ పార్ట్ లోనే అసలైన కంటెంట్ ఉండడంతో ఓ వర్గం వారికి సినిమాపై అమితమైన ఆసక్తి ఉంది. కానీ బాలకృష్ణ వెన్ను పోటును చూపించగలడా? వైస్రాయ్ ఘటనను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనే దానిలో అనుమానాలు గట్టిగానే ఉన్నాయి.
రేపు సాయంత్రం 5గంటల 55 నిముషాలకు విడుదల చేయబోయే ట్రైలర్ తోనే సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. ఒక్క కాంట్రవర్సీకి టచ్ చేసినా సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ అందుతాయని చెప్పవచ్చు. దర్శకుడు క్రిష్ అసలు కథకు ఎలా ముగింపు పలుకుతాడు అనేది సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. సినిమా భవిష్యత్తు ఏమిటో కాలంతో పాటు ట్రైలర్ కూడా నిర్ణయించే అవకాశం ఉంది. అంతేకాక చిత్ర యూనిట్ అలాగే బయ్యర్స్ టెన్షన్ లో ఉన్నారనే చెప్పాలి.