విజయవాడ, ఫిబ్రవరి 15: ఏపీలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ కి ఎన్నికల సంఘం హెలికాఫ్టర్ గుర్తును కేటాయించింది. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ… ‘మాది పగిలిపోయే గ్లాస్ కాదు, తొక్కితొక్కి ఊడిపోయే సైకిల్ కాదు, తుప్పుపట్టిన ఫ్యాన్ కాదు.. మాది హెలికాఫ్టర్’ అని అన్నారు. నేడు విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అంతేకాకుండా రేపు సాయంత్రం 5 గంటలకు తమ ప్రజాశాంతి పార్టీ మానిఫెస్టోని అధికారికంగా విడుదల చేయనున్నట్లు పాల్ తెలిపారు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమతో ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేఏ పాల్ జోస్యం చెప్పారు.