ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్...!

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 10:28 AM

ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్...!

న్యూడిల్లీ, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు గట్టి షాక్ తగిలింది. రాబర్ట్ వాద్రా సంస్థకు చెందిన రూ.4.62 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల్లో వాద్రా కంపెనీకి చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. 18.59 లక్షల విలువ చేసే చరాస్థులు, రూ.4.43 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. బికనేర్ భూ కంభకోణం కేసులో ఈడీ 2015లో క్రిమినల్ కేసు నమోదు చేసింది.

ఈ ఆస్తులు వాద్రాకు చెందిన మెసర్స్ స్కై లైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించారు. భూకేటాయింపుల్లో ఫోర్జరీ జరిగిందని ఆరోపిస్తూ బికనేర్ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌ జైపూర్‌లోని ఈడీ కోర్టులో హాజరయ్యారు. గతవారం రాబర్ట్ వాద్రాను ఈడీ ఢిల్లీలో మూడు రోజులపాటు విచారించింది. తాజాగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటించింది.





Untitled Document
Advertisements