14 సంవత్సరాల తర్వాత మళ్ళీ జోడి కట్టబోతున్నారు

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 10:47 AM

14 సంవత్సరాల తర్వాత మళ్ళీ జోడి కట్టబోతున్నారు

చెన్నై, ఫిబ్రవరి 16: సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' సినిమాతో హిట్ కొట్టాడు. దీంతో రజిని తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల 'సర్కార్' సినిమాతో విజయాన్ని అందుకున్న మురుగదాస్ దర్శకత్వంలో రజినీ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఇందులో కీర్తి సురేష్ ని కథానాయికగా తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం మురుగదాస్ నయనతారని సంప్రదించినట్లు తెలుస్తుంది. నయనతార కూడా కథ విని ఈ సినిమాని ఓకే చేసినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమా షూటింగ్ మర్చి లో ప్రారంభం కానుంది.





Untitled Document
Advertisements