ఆ హీరోతో ఆరోసారి జోడీ కట్టనున్న స్వీటీ

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 01:08 PM

ఆ హీరోతో ఆరోసారి జోడీ కట్టనున్న స్వీటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 16: అనుష్క తెలుగులో కొన్ని సంవత్సరాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. ఆమె సినిమాలు చేయడానికి గ్యాప్ తీసుకుంటున్న కూడా ఆమె స్థానం తెలుగు సినిమాలో అలాగే ఉంది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా తెలుగు టాప్ హీరోయిన్ మాత్రం అనుష్కనే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే 'భాగమతి', 'బాహుబలి' సినిమాల తర్వాత ఆమె తెరపై కనిపించలేదు. ప్రస్తుతం 'సైలెన్స్' అనే సినిమాలో మాధవన్ తో కలిసి నటిస్తుంది.

నాగార్జున తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా 'మన్మధుడు' సినిమాను రీమేక్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి అనుష్క ఫోటో షూట్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మార్చి నెల రెండవ వారంలో 'మన్మధుడు' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.





Untitled Document
Advertisements