న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 50 నిమిషాల రుణపథకంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి 2018 లో ఎంఎస్ఎంఇ రంగానికి 59 నిమిషాల రుణపథకాన్ని స్వయంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.కోటి వరకూ ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ విధానంలో లోన్లు తీసుకునే సదుపాయం ఉందని ఆనాడు ప్రకటించారు.
పిఎస్బిలోన్ఇన్59 మినిట్స్ పోర్టల్కు దరఖాస్తు చేసిన 59 నిమిషాల్లోనే రుణం మంజూరవుతుందన్నది ఈ పథకం సారాంశం. ఎంఎస్ఎంఇ పల్స్, సిడ్బీ, సిబిల్ ప్రచురణలను చూస్తే ఎంఎస్ఎంఇ రుణ మార్కెట్ రూ.25 కోట్లలోపు ఉన్నది సుమారు రూ.25 లక్షల కోట్ల వరకూ ఉంది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 50శాతం వాటాతో ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ రుణాల్లో 75శాతం వాటాతో ఉన్నాయి.
వాటిలో ఎక్కువ రూ.10 లక్షల రుణాలే కావడం విశేషం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ వ్యయంతోనే రుణం లభిస్తుంది. 5-7శాతం వడ్డీతో ఉంటుందని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే తక్కువ వడ్డీకే రుణం లభిస్తుందని పారిశ్రామికవేత్తలు ఉత్సాహపడ్డారు. అయితే రానురాను ఇవి రావడం మంజూరుకావడం సంక్లిష్టం అవుతోంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు కేవలం సెక్యూరిటీ ఉంటేనే రుణం ఇస్తాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు ఉత్పత్తిరంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. ఆహారశుద్ధిరంగం, టెక్స్టైల్, కెమికల్స్, ఆటో విడిభాగాలకు ఎక్కువ కేటాయింపులు జరిపినా రుణాలు లభించడం తక్కువే. ఈ పోర్టల్కు డిమాండ్ భారీగానే ఉంది. సుమారు 1.31 లక్షల దరఖాస్తులు రెండు నెలలకే అందాయి. సగటు రునం రూ.30 లక్షలుగా ఉంది. ఈ దరఖాస్తులు సుమారు 40వేల కోట్లవరకూ ఉనానయి.
ఎంఎస్ఎంఇ రంగంలో ఐదుశాతం కంపెనీల రుణభారం రూ.కోటికి తక్కువగానే ఉంది. ఇపుడున్న అంచనాలను చూస్తే ఎంఎస్ఎంఇ బకాయిలు రూ.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. కోటి రూపాయలకు లోబడిన రుణాలు మొత్తం రునాల్లో 30శాతం వాటాతో ఉంది. మొత్తం ఎస్ఎంఇ రంగంలో కోటి రూపాయల రుణం రూ.7.6 లక్షలకోట్లుగా ఉంది. రుణం మంజూరయిన తర్వాత కూడా పంపిణీ ఒక సవాల్గా నిలిచింది.
పోర్టల్పరంగా మంచి పథకమే కానీ మంజూరు విడుదలపంపిణీని కూడా జాప్యం తగ్గించాల్సి ఉంటుంది. పోర్టల్వల్ల తరచూ బ్యాంకు శాఖలకు వెళ్లే సమస్య తప్పుతున్నది. అలాగే ఎంఐఎస్ పరంగా రుణాల మంజూరు తిరస్కృతి కూడా సులువవుతున్నది. అధికారికగణాంకాలప్రకారం పోర్టల్కు 1.31 లక్షల దరఖాస్తులు మొదటి 50రోజుల్లోనే అందాయి.
వీటిలో 1.12 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వాటిమంజూరుశాతం 85గా ఉంది. ఈ మొత్తం దరఖాస్తుల్లో మంజూరయినవి 40,669కేసులున్నాయి. కేవలం మూడోవంతు మాత్రమే మంజూరయ్యాయి. ఇక విధానపరంగాచూస్తే టేకోవర్ రుణాలు బ్యాంకర్ల మధ్య నిబందనలు సడలించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉదాహరణకు ప్రస్తుత సెటప్లో వర్కింగ్ క్యాపిటల్ రుణం విభిన్న బ్యాంకర్లనుంచి తీసుకోవడం కష్టం అవుతోంది.
పారిపస్సు విధానంలో చిన్నరుణాల వాటాను తీసుకునేందుకు కొన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. రుణం మంజూరుతోపాటు విడుదలను కూడా వెనువెంటనే చేస్తే ఎంఎస్ఎంఇ రంగానికి ఎంతోమేలుచేసినట్లవుతుందని ఆర్ధికరంగనిపుణులు,పారిశ్రామికనిపుణులుచెపుతున్నారు.