ముంబై, ఫిబ్రవరి 16: భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ త్వరలో ప్రారంభం కానున్న ఐసిసి ప్రపంచకప్-2019 టోర్నీకి టీం ఇండియా జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను కాకుండా దినేశ్ కార్తీక్కు అవకాశం ఇచ్చాడు.
దినేష్ కార్తీక్ను బిసిసిఐ సెలక్షన్ కమీటీ పక్కన పెడితే, గవాస్కర్ అందుకు భిన్నంగా కేఎల్ రాహుల్ ,రహానే స్థానంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కార్తీక్ వైపే మొగ్తు చూపడం విశేషం. తన మనసులో ఉన్న టీం సభ్యుల పేర్లను గవాస్కర్ వెల్లడించారు.
గవాస్కర్ టీం:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, ధోనీ, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.