వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అమితాబ్‌ బచ్చన్‌ ఆర్థిక చేయూత

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 08:26 PM

వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అమితాబ్‌ బచ్చన్‌ ఆర్థిక చేయూత

ముంభై, ఫిబ్రవరి 16: పుల్వామలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోడానికి పలు ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఒక్కో యోధుడికి కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున మొత్తం రూ. 2.5 కోట్ల సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఏపీ నుంచి చనిపోయిన వారు ఎవరూ లేకున్నా ఈ సాయాన్ని ప్రకటించారు. ఈ ఉగ్రవాద దాడి అత్యంత బాధాకారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. కాగా, అమరుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని రియలన్స్ కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ హామీ ఇచ్చారు.





Untitled Document
Advertisements