హైదరాబాద్, జూలై 31 : విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రంలో నటిస్తున్నారని, ఇందుకోసం విజయ్ తో సంప్రదింపులు కూడా చేశారని తెలుస్తుంది. ఇందులో సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్, ఆమె భర్త జెమిని గణేశన్ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో సమంత నటిస్తున్నారు.
అయితే ఇందులో కీలకమైన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను ఎవరు చేస్తారనేది ఆసక్తిగా మారింది. గతంలో వీటి కోసం జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లతో చేయించాలని అనుకున్నారు, కాని కుదరలేదు. ఇప్పుడు ఇందుకోసం విజయ్ దేవరకొండ ను తీసుకున్నారని సమాచారం. కాని ఈ రెండు పాత్రల్లో విజయ్ ఏ పాత్ర లో నటిస్తారో వేచి చూడాలి.