టెక్సాస్, ఫిబ్రవరి 19: టెక్సాస్ లో నివసిస్తున్న ఓ భారతీయుని కుటుంబంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాల వల్ల భార్య భర్తలు ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాల ప్రకారం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నెకరకంటి శ్రీనివాస్ కి భార్య శాంతి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్న విషయంపై భార్యతో గొడవకు దిగిన శ్రీనివాస్ ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు.
ఆ తరువాత తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇంటి నుంచి కాల్పుల శబ్ధం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటన సమయంలో కూతురు ఇంట్లోనే ఉండగా కొడుకు కాలేజీకి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.