భార్యను చంపి...ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 02:46 PM

భార్యను చంపి...ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై

టెక్సాస్‌, ఫిబ్రవరి 19: టెక్సాస్ లో నివసిస్తున్న ఓ భారతీయుని కుటుంబంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాల వల్ల భార్య భర్తలు ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాల ప్రకారం ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నెకరకంటి శ్రీనివాస్ కి భార్య శాంతి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్న విషయంపై భార్యతో గొడవకు దిగిన శ్రీనివాస్‌ ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు.

ఆ తరువాత తాను కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. అయితే ఇంటి నుంచి కాల్పుల శబ్ధం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటన సమయంలో కూతురు ఇంట్లోనే ఉండగా కొడుకు కాలేజీకి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements