వాళ్లకు జగన్ ఊడిగం చేస్తున్నారు : టీడీపీ మంత్రి

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 05:51 PM

వాళ్లకు జగన్ ఊడిగం చేస్తున్నారు : టీడీపీ మంత్రి

గుంటూరు, ఫిబ్రవరి 19: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించిన తరువాత ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం కలగజేసుకున్నందుకు తాము కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేలుపెడతాం అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకి తప్పకుండ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా చెప్పారు.

ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకుంటున్నారు. దాంతో చాల మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వలసలు వెళుతున్నారు. దీనిపై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు.

ఈరోజు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారని, ఆ నేతలంతా ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ల కారణంగానే నాయకులు టీడీపీని వీడుతున్నారని ఆనందబాబు ఆరోపించారు.

హైదరాబాద్ లోని తమ ఆస్తులు పోతాయని భయపడ్డ నేతలు ప్రస్తుతం పార్టీలు మారుతున్నారన్నారు. కేసుల నుండి బయటపడడానికి మోదీ, కేసీఆర్ లకు జగన్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే కేసీఆర్, కేటిఆర్ ఆంధ్రాకు వచ్చి జగన్ తో కలసి పోటీ చేయాలని సవాల్ విసిరారు.





Untitled Document
Advertisements