అందుకే .....ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంకాను రంగంలోకి దించారా?

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 05:57 PM

అందుకే .....ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంకాను రంగంలోకి దించారా?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: తాజాగా రాజకీయ ప్రవేశం చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్ర రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ “నేను ఒక్కదానినే పైనుంచి అద్భుతాలు చేయలేను. నాకు మీ అందరి సహాయసహకారాలు చాలా అవసరం. పార్టీని గెలిపించుకోవాలంటే బూత్ స్థాయి నుంచి బలంగా ఉండాలి. అందరూ కష్టపడి పనిచేయాలి,” అని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ పుట్టిల్లు వంటిదే అయినప్పటికీ, గత మూడు దశాబ్ధాలుగా యూపీలో అధికారంలోకి రాలేకపోతోంది.

కనుక ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంకా వాద్రాను రంగంలో దించినట్లయితే ఆమె యూపీలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగలరని రాహుల్ గాంధీ ఆశపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించడానికి తన వద్ద మంత్రదండం ఏమీ లేదని, బూత్ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉంటేనే సత్ఫలితాలు సాధించగలమని ఆమె చెప్పడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది. ఆమె రాకతో యూపీలో అద్భుతాలు జరుగకపోయినా, ఎస్పీ-బీఎస్పీ కూటమిని, అధికార బిజెపిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకొనే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements