గుంటూరు, ఫిబ్రవరి 19: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ వలసలు అధికార టీడీపీ లో భారీగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది నేతలు ఇతర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే మోదుగుల టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ... వైసీపీ అధ్యక్షుడు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మోదుగులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టికెట్ ను నిరాకరించబోతున్నారనే ప్రచారం గత కొన్ని నెలలుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారినట్టు సమాచారం. కాగా ఆయన వైసీపీ తరపున సత్తెనపల్లి అసెంబ్లీ లేదా నరసరావు పేట ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.