తమిళనాడులో పోటీకి పొత్తు కుదుర్చుకున్న బీజేపీ...

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 06:57 PM

తమిళనాడులో పోటీకి పొత్తు కుదుర్చుకున్న బీజేపీ...

తమిళనాడు, ఫిబ్రవరి 19: తమిళనాడులో అన్నాడీఎంకే, పీఎంకే లు బీజేపీతో చేతులు కలిపాయి. రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని ప్రకటించాయి. ఆ రాష్ట్రంలో అన్నాడీఏంకే, డీఎంకే పార్టీల తరువాత అతిపెద్ద పార్టీ అయిన పీఎంకే పార్టీతో చర్చలు జరిపిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం బీజేపీతోనే కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. తమిళనాడులో తరహాలోనే పుదుచ్చేరిలో కూడా ఇదే పొత్తు కొనసాగుతుందని పన్నీర్‌ సెల్వం తెలిపారు.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ తో అన్నాడీఎంకే పార్టీ నేతలు పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం పొత్తులపై సంయుక్త ప్రకటన చేశారు. మళ్లీ మోదీని ప్రధానిని చేయడం కోసం అన్నాడీఎంకే కృష చేస్తుందని భావిస్తున్నామని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.





Untitled Document
Advertisements