జయరాం హత్య కేసులో నటుడు సూర్యపై పోలీసుల అనుమానాలు..

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 08:09 PM

జయరాం హత్య కేసులో నటుడు సూర్యపై పోలీసుల అనుమానాలు..

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పటికే పలుమలుపులు తిరిగింది. జయరాం హత్య కేసులో పలువురిని విచారించిన పోలీసులు తాజాగా నటుడు సూర్యప్రసాద్ ని కూడా విచారించారు. కాగా ఈ కేసులో తన పాత్ర లేదని సూర్యప్రసాద్ అంటున్నారు. హోటల్లో ఉన్న జయరాంను రాకేష్ చెప్పడంతో కిశోర్ తో పాటు తాను కారులో తీసుకుని వెళ్లామని, రాకేష్ ఇంట్లో జయరాంను దించేసి తాము వచ్చేశామని చెప్తున్నారు. కలియుగ సినిమా విడుదలకు డబ్బులు సర్దుబాటు చేస్తాడనే ఉద్దేశంతో తాను కిశోర్ ను వెంటపెట్టుకుని రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు.

అయితే ఆ రోజు జయరాంను దించగానే వెళ్లిపోవాల్సిందిగా రాకేష్ రెడ్డి చెప్పాడని, దాంతో కిశోర్ తానూ వెనక్కి వచ్చేశామని అంటున్నాడు. కాగా సూర్య చెబుతున్న విషయాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య విషయం తెలిసి కూడా అతను పోలీసులకు ఎందుకు చెప్పలేదనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సూర్య జయరాం హత్య జరిగిన తర్వాత కూడా రాకేష్ రెడ్డికి ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు.





Untitled Document
Advertisements