ఢిల్లీ, ఫిబ్రవరి 19: ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజికి వ్యాపారంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ కంపెనీ కార్ల అమ్మకాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుంది. ఈ కంపెనీ తయారు చేసిన ఎస్యూవీ విటార బ్రెజా కారు అమ్మకాలు నాలుగు లక్షలకు చేరాయి. ఈ మేరకు మంగళవారం మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్.కల్సి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘనతను కేవలం మూడేళ్ళలోనే సాధించామని ఆయన అన్నారు.
అయితే ఇప్పటివరకు దేశంలో కాంపాక్ట్ ఎస్యువీ కార్ల విభాగంలో విటారా బ్రెజా వాహన అమ్మకాల వాటా 44.1శాతం ఉందని కంపెనీ వెల్లడించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున ఏడు శాతం వృద్ధితో నెలకు సగటున 14,675 విటారా బ్రెజా మోడల్ కార్లు విక్రయిస్తున్నామని కంపెనీ యాజమాన్యం తెలిపింది.