తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతకు గుండెపోటు

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 10:44 PM

 తెలుగు దేశం పార్టీ  సీనియర్ నేతకు గుండెపోటు

అమరావతి , ఫిబ్రవరి 19: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు . మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక రమేష్‌ హాస్పిటల్‌కు తరలించగా.. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు . కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించినట్టు వినికిడి.





Untitled Document
Advertisements