"దర్శకుడు" తొలి టికెట్ కొనుగోలు చేసిన మెగాస్టార్

     Written by : smtv Desk | Wed, Aug 02, 2017, 06:22 PM


హైదరాబాద్, ఆగష్టు 2 : ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. మరోవైపు సుకుమార్ నిర్మాతగా ఓ సినిమాని సిద్ధం చేశాడు. అశోక్, ఈషా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం "దర్శకుడు". ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మెగా సెన్సేషనల్ అయింది. ఎందుకనగా "దర్శకుడు" సినిమా తొలి టికెట్ ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేయడమే కారణం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.





Untitled Document
Advertisements