అమరావతి, ఆగష్టు 2: గతంలో ఏపీ ముఖ్యమంత్రి నంద్యాల ఉపఎన్నికల నేపధ్యంలో ఒక్కో ఓటును రూ. 5వేలు ఇచ్చి కొనుగోలు చేయగల సామర్ధ్యం ఉందని వ్యాఖ్యానించారని, ఆయన మాటలనే సుమో టోగా తీసుకుని వెంటనే అరెస్టు చేసి, కేసు నమోదు చేయాలని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అంతా కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ సీట్ల పెంపు 2026 వరకు సాధ్యం కాదని స్పష్టం చేసిన నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబులో భయం మొదలైందని ఆయన తెలిపారు. సీట్ల పెంపు కోసం రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు కేంద్రంలో తాకట్టు పెట్టారన్నారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆకట్టుకున్నారని, ఇప్పటికైనా వాళ్ళు బాబును ప్రశ్నించాలన్నారు.