అమరావతి, ఆగష్టు 3: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి నారా లోకేష్ తో మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్న సందర్భంగా లోకేష్ అంటే ఆంధ్రా పప్పు అని ప్రచారం సాగుతుంది అని అడగగా, ఆయన తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 2014-16లో ఎవరూ అనుకోని విధంగా 50 లక్షల మందిని సభ్యులుగా పార్టీలో చేర్పించాను. అలాగే 2016-18లో 70 లక్షల మంది కార్యకర్తలను చేర్పించాను. తెలుగుదేశం కార్యకర్తగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన దాదాపు 2 వేల కుటుంబాలను ఆదుకున్న వాడిని నేను. ప్రస్తుతం నేను ఎవరూ ఊహించని విధంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు, 40 లక్షల వీధి దీపాలు పెడుతున్నాం. ఇవన్నీ పప్పోడే చేయగలిగితే పప్పు... ఉప్పోడే చేయగలిగితే ఉప్పోడు అవుతాడు" అన్నారు. అంతర్జాలంలో 'ఏపీ పప్పు' అని శోధిస్తే మీ పేరు వస్తుందన్న మాటపై స్పందిస్తూ... చేయనివ్వండి దాని కన్నా ఇంకేమీ చేయలేరు. రెండు ఆర్టికల్స్, ప్రోగ్రాములు చేస్తారు. సోషల్ మీడియా ప్రచారాన్ని తాను పట్టించుకోను” అని ఆయన స్పష్టం చేశారు.