హైదరాబాద్, మార్చ్ 12: హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా ద్విచక్ర వాహనంపై ఇంటర్ విద్యార్థులు సయ్యద్ ఫరాద్, సాధిక్లు కలిసి మెహదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని చెక్ పోస్టు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాధిక్ బస్సు కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన సయ్యద్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.