న్యూఢిల్లీ, మార్చ్ 14: ఈ నెల 19న జరగనున్న జిఎస్టి మండలి సమావేశంకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జిఎస్టి మండలి సెక్రటేరియట్ ఇందుకు సంబంధించి 34వ సమావేశం ఈనెల 19వ తేదీజరుగుతుందని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ప్రస్తుతం జిఎస్టి 12శాతం తోపాటు ఇన్పుట్ట్యాక్స్క్రెడిట్ సౌలభ్యాన్ని కూడా అమలుచేస్తోంది. నిర్మాణంలోఉన్న ఆస్తులు, ఇక అందుబాటులో పక్కాగృహాల ప్రాజెక్టుకు మాత్రం ప్రస్తుతం ఉన్న ఎనిమిదివాతం పన్నును ఒకటిశాతంగా నిర్ణయించింది.