సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు

     Written by : smtv Desk | Sat, Mar 16, 2019, 01:17 PM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు

సికింద్రాబాద్‌, మార్చ్ 16: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రస్తుతానికి కేవలం వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌలభ్యం కోసంఅందుబాటులోకి తీసుకువచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ కార్లను రూ.45 చెల్లించి వినియోగించుకోవచ్చు. మొదటి దశలో ఐదు కార్లను అందుబాటులోకి తెచ్చామని.. తర్వలో మరిన్ని కార్లు తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.





Untitled Document
Advertisements