'మా' గొడవలు.. మళ్లీ

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 08:05 AM

'మా' గొడవలు.. మళ్లీ

హైదరాబాద్, మార్చ్ 17:మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ 2019 ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శివాజి రాజా, నరేష్ ప్యానెల్స్ మధ్య జరిగిన ఈ పోటీలో నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. ఒకరిద్దరు శివాజి రాజా ప్యానెల్ కు సంబందించిన అభ్యర్ధులు గెలిచారు. కొత్త అధ్యక్షుడిగా నరేష్ బాధ్యతలను చేపట్టేందుకు రెడీ అయ్యారు. అయితే అసలైతే శివాజి రాజాకు మా అధ్యక్షుడిగా ఈ నెల 31వరకు కాలపరిమితి ఉంది.

అయినా ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి కొత్త అధ్యక్షుడు నరేష్ బాధ్యతలను చేపట్టదలచాడు. దానికి శివాజి రాజా ఒప్పుకోవట్లేదు. ఓడినా తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాడు శివాజి రాజా. 31 తర్వాత నువ్వు అధ్యక్షుడివి.. అప్పటిదాకా నా సీట్లో కూర్చోవద్దని చెప్పాడట. ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రస్థావించాడు నరేష్. మార్చి 22న తాను కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోదలచానని.. కాని శివాజి రాజా అలా చేస్తే కోర్ట్ కు ళ్తానని అంటున్నాడట.

మరి ఈ 15 రోజులు శివాజి రాజా ఏం చేస్తాడు. అసలు ఎందుకు ఆయన ఇంత పట్టు పడుతున్నాడన్నది ఎవరికి అర్ధం కావట్లేదు. నరేష్ ప్యానెల్ సభ్యులంతా ఈ విషయంపై శివాజి రాజా మీద సీరియస్ గా ఉన్నారు. సిని పెద్దల దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం దొరికేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.





Untitled Document
Advertisements