జనసేనలో చేరనున్న ఉండవల్లి..

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 06:22 PM

జనసేనలో చేరనున్న ఉండవల్లి..

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలకు వలసలు రావడం సర్వ సాధారణం.ఇప్పటికే అధికార పార్టీ నుంచి ఎంతో మంది ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లోకి క్యూలు కట్టారు, అలాగే వైసీపీ నేతలు కూడా పలువురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇక అలాగే ఏపీలో మూడవ బలమైన ప్రత్నామ్యాయం అయిన జనసేన పార్టీలోకి కూడా ఇప్పటికే చాలా మంది మేధావులు జాయిన్ అయ్యారు,ఈ రోజు కూడా తాజాగా మాజీ సిబిఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ చేరడంతో జనసేన పార్టీకి మరింత బలం చేకూరింది.అయితే జనసేన పార్టీలోకి వస్తున్న ఈ వలసల పర్వం ఇంకా కొనసాగనుంది అని తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి.

ఈ లిస్ట్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నట్టు సమాచారం.ఇప్పటికే పవన్ మరియు ఉండవల్లి అరుణ్ కుమార్లు పలు సమావేశాల్లో భేటీ అయ్యారు.ఉండవల్లికి కూడా పవన్ అంటే మంచి అభిప్రాయమే ఉందని చాలా మంది తెలిపారు.అంతకు మునుపే తాను పూర్తిగా రాజకీయాలను వదిలేసానని ఏ పార్టీలోనూ పోటీ చేయనని తెలిపారు.కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మాత్రం ఉండవల్లి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.ఈ వార్త నిజమే అయితే పవన్ కు ఇంకాస్త బలం పెరింగిందనుకోవచ్చు.మరి ఈ వార్త ఎన్తవరకు నిజమో తెలియాలంటే పవన్ కానీ ఉండవల్లి కానీ అధికారికంగా వెల్లడి చేయాల్సిందే..





Untitled Document
Advertisements