తిరుమల: తిరుమలలో మూడు నెలల వయస్సు ఉన్న ఓ బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. తిరుమలలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తుండగా బాలుడిని కిడ్నాప్ చేశారు. తమిళనాడుకు చెందిన మహవీర్, కౌసల్య దంపతులు కొంతకాలంగా తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి మూడు నెలల కొడుకు వీరేశ్ ఆదివారం తెల్లవారుజాము నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసి టివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వీరేశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.