భద్రాద్రి కొత్తగూడెం, మార్చ్ 18: ఓ ప్రేమికుడు.. తన ప్రేమికురాలిని తగులబెట్టి తనను తాను కాల్చుకున్న సంఘటనా జిల్లాలోని చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలోని చోటు చేసుకున్నది. వివరాలలోకి వెళితే.. వినోద్, తేజస్విని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరూ గత రెండున్నరేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వారిద్దరికి గొడవలు జరుతున్నాయి. దీంతో సైకోగా మారిన వినోద్(25) గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తేజస్వినిని తగులబెట్టి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.