హాస్ప‌ట‌ల్లో ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్‌

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 05:00 PM

హాస్ప‌ట‌ల్లో ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్‌

హైదరాబాద్‌ (పాకిస్తాన్), మార్చి 18: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ముషర్రఫ్‌ అత్యవసరంగా దుబాయ్‌ హాస్పటల్లో చేర్పించారు. ఆయన అమిలోడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఇప్పటికే ఆ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆ వ్యాధి మళ్లీ ముదరండతో ముష‌ర్ర‌ఫ్‌ను దుబాయ్‌కి త‌ర‌లించారు. ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించిందిఈ వ్యాధి వ‌ల్ల మాజీ అధ్య‌క్షుడు ముష‌ర్ర‌ఫ్ త‌న కాళ్ల మీద నిల‌బ‌డ‌లేక‌పోతున్నారు, న‌డ‌వ‌లేక‌పోతున్నారు. గ‌తంలో ఇదే వ్యాధి కోసం లండ‌న్‌లో ఆయ‌న ట్రీట్‌మెంట్ తీసుకున్నారు.





Untitled Document
Advertisements