నామినేషన్లకు మూడు రోజులు సెలవు

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 05:18 PM

నామినేషన్లకు మూడు రోజులు సెలవు

హైదరాబాద్‌, మార్చ్ 18: తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. ఐతే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 21వ తేదీ(హోలి), 23(నాలుగో శనివారం), 24(ఆదివారం)వ తేదీన సెలవులు కాబట్టి.. ఆ రోజుల్లో నామినేషన్లను స్వీకరించమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు పూర్తి స్థాయి సిబ్బంది కేటాయింపులు చేశామని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements