లక్నో, మార్చ్ 18: బీఎస్పీ నేత మాయావతి మరోసారి కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. నిన్న లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్.. ఎస్పీ,బీఎస్పీ,ఆర్ ఎల్ డీ కూటమికి 7 సీట్లను వదిలేస్తున్నట్టుగా తెలిపారు. దీనికి కౌంటర్ గా బీఎస్పీ చీఫ్ మాయావతి కాంగ్రెస్ పార్టీ యూపీలో స్వేచ్ఛగా 80 లోక్సభ స్థానాల్లో పోటీ చేసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. అయితే మొదట్నుంచి.. బీఎస్పీ కలిసి పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్.. మాయావతి ఒప్పుకోకపోవడంతో ఒంటరిగానే యూపీలో సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచింది.