అమరావతి, మార్చ్ 19: ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైఎస్ఆర్సిపి తరుపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. రెండు రోజులుగా ఆయన పలు జిల్లాల్లో పర్యటనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మరో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెం, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని వేమూరులో జగన్ ప్రచారం చేయనున్నారు.