టీడీపీ నుండి మరొక నేత రాజీనామా

     Written by : smtv Desk | Tue, Mar 19, 2019, 06:48 PM

టీడీపీ నుండి మరొక నేత రాజీనామా

ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నిన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో తన పేరు లేనందున నరసాపురం నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2004లో టీడీపీ తరపున నరసాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతరం ప్రజారాజ్యంలో చేరి 2009లో పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరవాత 2014లో వైకాపాలో చేరి పోటీ చేసి అప్పుడో ఓడిపోయి చివరికి టీడీపీకే చేరుకున్నారు. మంచి సామాజిక వర్గం బలం కలిగి ఉన్న సుబ్బారాయుడు ఈసారి టీడీపీ తరపున టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు ఆ స్థానాన్ని మాధవ నాయుడుకి కేటాయించారు. దీంతో ఇన్నాళ్లు ఎదురుచూసిన సుబ్బారాయుడు అంసతృప్తికి లోనై పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే వైకాపా నుండి నరసాపురం అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు ఫైనల్ అయ్యారు కాబట్టి ఆయన్ను మార్చే ప్రసక్తి లేదు. అలాగే జనసేన నరసాపురం అభ్యర్థిగా శ్రీ బొమ్మడి నాయకర్ ఎంపికయ్యారు. మరి టికెట్ ఆశిస్తూ టీడీపీని వీడుతున్న సుబ్బారాయుడు ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements