మామను మించిన అల్లుడు

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 01:01 PM

మామను మించిన అల్లుడు

హైదరాబాద్, ఆగస్ట్ 8: సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలా పాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'వీఐపీ-2'. ఈ చిత్రంలో వివేక్, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 'వీఐపీ' సినిమాతో తమిళంలో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ 'రఘువరన్ బీటెక్' తో తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకున్నారు. అందుకే ఈ యంగ్ హీరో నటించిన 'వీఐపీ' సీక్వెల్ 'వీఐపీ 2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. గత సంవత్సరం రిలీజ్ అయిన 'కబాలీ' చిత్రం రికార్డులను ఈ 'వీఐపీ 2' బ్రేక్ చేసిందట. మలేషియాలో 'కబాలీ' చిత్రం 480 థియేటర్లలో విడుదల కాగా ఇప్పుడు ధనుష్ 'వీఐపీ-2' ఏకంగా 550 థియేటర్లలో రిలీజ్ కానుందట. ఈ విషయం లో ధనుష్ మామను మించిన అల్లుడు అనిపించుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఇంకా థియేటర్ల సంఖ్యను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సింగపూర్ లో కూడా ఈ చిత్రానికి 'పీ 13' సర్టిఫికేట్ లభించిందట. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా కలెక్షన్లపై భారీ అంచనాలు పెంచుకున్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements