తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు

     Written by : smtv Desk | Wed, Mar 20, 2019, 08:33 PM

 తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థిత్వంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. లోకేష్‌ మంగళగిరి నుంచి గెలుస్తాడన్న నమ్మకం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించకుండా లోకేశ్‌ను పోటీచేయిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలాగా లోకేష్‌ను కూడా ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు.

ఈరోజు ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ?’ అని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements