వంగవీటి రాధకు షాక్ ఇచ్చిన టీడీపీ

     Written by : smtv Desk | Wed, Mar 20, 2019, 08:49 PM

వంగవీటి రాధకు  షాక్ ఇచ్చిన టీడీపీ

గత కొన్ని రోజులు క్రితం వంగవీటి రాధ తాను అప్పటి వరకు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతునే ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ పై చేసిన ఆరోపణలు ఎంత సంచలనానికి దారి తీశాయో అందరికీ తెలుసు.అయితే ఆ తర్వాత రాధ వైసీపీ ని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అన్న అంశం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చకు వచ్చింది.అయితే అసలు ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు.అయితే ఈయనిలా ఈ పార్టీలో చేరే సరికి వంగవీటి అభిమానుల్లో చాలా మంది రాధపై అసంతృప్తి వ్యక్తం చేసారు.అయినా రాధా అవేమి పట్టించుకోలేదు,తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఆశలు పెట్టుకొని చేరిన రాధాకు ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానం ఊహించని షాకిచ్చినట్టు తెలుస్తుంది.

నిజానికి రాధా వైసీపీలో ఉన్నపుడు తాను విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించిన సంగతి తెలిసినదే.అక్కడ మొదలైన వివాదం చిలికి గాలివానై రాధను టీడీపీలో చేర్చేలా చేసింది.అయితే టీడీపీలో చేరిన అనంతరం రాధాకు టీడీపీలో ఉన్నత పదవులో లేక ఏదొక సీటు ఇస్తారని అందరు భావించారు,ఒక రకంగా రాధా కూడా భావించి ఉండొచ్చు కానీ ఈసారి జరగనున్న ఎన్నికల్లో రాధకు ఎలాంటి సీటు ఇస్తున్న సూచనలు ఐతే టీడీపీ ఇస్తున్నట్టు లేదు అని తెలుస్తుంది.ఈ ఎన్నికలకు రాధను కేవలం ఎన్నికల స్టార్ కాంపైనర్ గా మాత్రమే పనిచేయమని వారు భాద్యతలు అప్పగించినట్టు సమాచారం.ఇదిలా ఉండగా వైసీపీలో ఉన్నపుడు కనీసం సీటు అయినా ఇచ్చారు ఇప్పుడు అది కూడా లేదని పలువురు వైసీపీ అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements