నామినేషన్ వేసిన జగన్… ఆస్తులు వివరాలు ఇలా

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 07:58 AM

నామినేషన్ వేసిన జగన్… ఆస్తులు వివరాలు ఇలా

కడప: పులివెందులలో ప్రతిపక్షనేత, వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, పెట్టుబుడుల వివరాలు జగన్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలతో పాటు 47 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ సమర్పించారు. అఫిడవిట్‌లోని 18 పేజీల్లో జగన్‌పై ఉన్న కేసుల వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం జగన్ కు తన పేరిట రూ35,30,76,374(35.30కోట్లు) స్థిరాస్తులున్నాయని, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వైఎస్ భారతి పేరిట రూ.31,59,02,925(31.59 కోట్లు) స్థిరాస్తులున్నాయని పేర్కొన్నారు. జగన్ మొత్తం చరాస్తుల విలువ రూ.339,89,43,352(359.89 కోట్లు), వైఎస్ భారతి చరాస్తుల విలువ రూ. 92,53,49,352(92.59 కోట్లు), జగన్ పెద్ద కుమార్తె హర్షిణీ రెడ్డి చరాస్థుల విలువ రూ. 6,45,62,191(6.45 కోట్లు), జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి చరాస్తుల విలువ రూ.4,59,82,372 (4.59 కోట్లు) ఉన్నాయని వెల్లడించారు.

జగన్ తన పేరిట మొత్తం అప్పుల విలువ రూ.1,19,21,202 (1.19 కోట్లు), జగన్ తన మొత్తం పెట్టుబడుల విలువ రూ.317,45,99,816(317.45 కోట్లు), వైఎస్ భారతి మొత్తం పెట్టుబడుల విలువ రూ.62,35,01,849(62.35 కోట్లు), జగన్ పెద్ద కుమార్తె హర్షిణీ రెడ్డి పెట్టుబడుల విలువ రూ.1,18,11,358(1.18 కోట్లు), జగన్‌కు బెంగళూరు ఓరియంటర్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.1,25,32,855 డిపాజిట్లు, హైదరాబాద్ స్టేట్ బ్యాంకు శాఖలో రూ.21,44,746 డిపాజిట్లు, హైదరాబాద్ మల్కాజిగిరి హెచ్‌డిఎఫ్‌సి బ్రాంచ్‌లో రూ.25వేల డిపాజిట్ ఉన్నాయని ప్రకటించారు.

భారతికి బెంగళూరు ఓరియంటర్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.20,90,821 డిపాజట్లు, బంజారాహిల్స్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.8,09,884 డిపాజట్లు, బెంగళూరు యాక్సిస్ బ్యాంక్‌లో రూ.17,41,087 డిపాజిట్లు, పులివెందుల ఎస్‌బిఐలో రూ.21,37,480 డిపాజిట్లు, యాక్సిస్ బ్యాంక్ ట్రావెల్ కార్డులో రూ.1,09,500, ఉన్నాయని తెలిపారు. హర్షిణీ పేరు మీద బెంగళూరు యాక్సిస్ బ్యాంకులో రూ.51,38,114 డిపాజిట్లు, లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో రూ.2,05,660 డిపాజిట్లు, వర్షారెడ్డి పేరు మీద బెంగళూరు యాక్సిస్ బ్యాంకులో రూ.2,07,115 డిపాజిట్లు ఉన్నాయని ప్రకటించారు.





Untitled Document
Advertisements